మృతుని కుటుంబానికి భరోసా కల్పించిన గురుకుల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటి నాయకులు జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు
దార మధు తెలుపగా
పెద్దపల్లి జిల్లా మంథని బాలుర గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పేరెంట్స్ కమిటి మృతుని కుటుంబానికి సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య ఇటివలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుమారుడు గురుకుల పాఠశాలలో చదువుతుండగా విషయం తెలిసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి సూచన ల మేరకు మానవతా దృక్పథంతో బుధవారం ఉపాధ్యాయులు మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం 8వ తరగతి విద్యార్థులు 6500 రూపాయలు పేరెంట్స్ కమిటి 1500 రూపాయలు అందజేశి ఆయన చిత్ర పటానికి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా టి జి పి ఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ పేరెంట్స్ కమిటి చైర్మన్ దార మధు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ నిజమైన వారసులని ఉపాధ్యాయులను అభివర్ణిస్తూ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు చిన్న వయసులో ఇంత గొప్ప మనస్సు ఉండడం చాల సంతోషం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి గిరిప్రసాద్, బి రాజు, ఓ నవీన్, విద్యార్థులు దార రోహిత్, ఎం వంశిసాయి, పేరెంట్ జిల్లేల్ల శంకర్ లు పాల్గొన్నారు.