HomeJobsJNTU: విద్యార్థులకు షాక్! మూడు ఎంటెక్‌ కోర్సుల ఎత్తివేత

JNTU: విద్యార్థులకు షాక్! మూడు ఎంటెక్‌ కోర్సుల ఎత్తివేత

JNTU: విద్యార్థులకు షాక్! మూడు ఎంటెక్‌ కోర్సుల ఎత్తివేత

మీరు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో ఎంటెక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే విద్యార్థులు తప్పనిసరిగా ఓ విషయం తెలుసుకోవాలి. వర్సిటీలో అధ్యాపకుల తీవ్ర కొరత కారణంగా ఎంటెక్ (M.Tech)లోని కొన్ని ప్రధానమైన స్పెషలైజేషన్ కోర్సుల్లో అడ్మిషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా సివిల్, ఐటీ సంబంధిత బ్రాంచ్ లకు చెంది ఎంతో డిమాండ్ ఉన్న ఈ కింది మూడు కోర్సులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి పక్కనబెట్టారు

JNTU MTech Admission Update Admissions Paused for Transportation and Environmental Geomatics Courses

  • ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ (Transportation Engineering)
  • ఎన్విరాన్‌మెంటల్ జియోమాటిక్స్ (Environmental Geomatics)
  • స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Spatial Information Technology)

ఎందుకు ఈ నిర్ణయం? కారణాలు ఇవే!

ఈ కోర్సులను ఆపేయడానికి ప్రధాన కారణం ప్రొఫెసర్ల తీవ్ర కొరత. వర్సిటీలో గత 15 ఏళ్లుగా రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడం, పైగా ఇటీవల గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు కూడా కోతలు విధించడంతో పాఠాలు చెప్పే అధ్యాపకులు కరువయ్యారు. తగినంత మంది బోధకులు లేకపోవడంతో గడిచిన ఐదేళ్లుగా ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న బ్యాచ్‌లలో ఎంటెక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌లో 18 మంది, ఎన్విరాన్‌మెంటల్‌ జియోమాటిక్స్‌లో 16 మంది, స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌లో 9మంది మాత్రమే విద్యార్థులు ఉండటంతో క్లాసులు నడపడం కష్టంగా మారింది.

BTech Admissions: తెలంగాణ టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..!
BTech Admissions: తెలంగాణ టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..!

పీజీఈసెట్ అభ్యర్థులు ఏం చేయాలి?

ఈ కోర్సులను పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాలు అధికారులను కలవగా, ప్రొఫెసర్ల నియామకం పూర్తయ్యాకే మళ్లీ వీటిని ప్రారంభిస్తామని, ప్రస్తుతానికి మిగతా అందుబాటులో ఉన్న కోర్సులను ఎంచుకోవాలని స్పష్టం చేశారు.

MBBS Seats: మన దేశంలో ప్రతి 778 మందికి ఒక డాక్టర్
MBBS Seats: మన దేశంలో ప్రతి 778 మందికి ఒక డాక్టర్

కాబట్టి జేఎన్‌టీయూలో ఈ నిర్దిష్ట విభాగాల్లో చేరాలని కలలు కంటున్న విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లలో ఇతర అందుబాటులో ఉన్న కోర్సులను లేదా వేరే విశ్వవిద్యాలయాలను ప్రత్యామ్నాయంగా (Alternative Options) ఎంచుకోవడం మంచిది. చివరి నిమిషంలో కౌన్సెలింగ్ సమయానికి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా మీ ప్లాన్ బి సిద్ధం చేసుకోండి!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments