- పునర్నిర్మాణ పనులు ప్రారంభం
- విరాళ మందచేసిన క్యాటరింగ్ అశోక్
- భక్తులు తోడ్పాటు అందించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిరం తాజాగా పునర్నిర్మాణం జరిగింది. ప్రజలందరూ రాములోరి సేవకు తమకు తోచినంత ధన రూపంలోనూ, వస్తు రూపంలో ఆలయానికి విరాళాలు అందజేశారు. ఐతే రామ మందిరం నిర్మాణంలో భాగంగా…. మండప నిర్మాణం మిగిలింది. మండప నిర్మాణానికి భక్తులు తమ వంతు చేయూతనందిస్తున్నారు. సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి అశోక్ సహకారం అందించారు. తన వంతు సహాయంగా ఆలయానికి 50వేల రూపాయలు విరాళం అందజేశారు. కొంచెం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రామ మందిరం మండప నిర్మాణం కొరకు భక్తులు తోడ్పాటు అందించాలని కమిటీ సభ్యులు కోరారు.