- సరళా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..!
- స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్లు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఆర్ బి ఓ ఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఆమె నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా 19వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్, 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి, మరియు 26వ వార్డు కౌన్సిలర్ రాజు గౌడ్ లు ఉన్నారు. వారు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. సరళా శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు.



