Home అంతర్జాతీయం ‘‘సోషల్ మీడియా స్టోరీస్ ఆధారంగా వాదనలు వినిపించవద్దు’’: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు...

‘‘సోషల్ మీడియా స్టోరీస్ ఆధారంగా వాదనలు వినిపించవద్దు’’: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

0

వదంతులు నమ్మవద్దు..

కాగా, కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన వదంతులు, కథనాలను ప్రజలు నమ్మవద్దని కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కోరారు. ప్రస్తుతం దర్యాప్తును నిర్వహిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ను విశ్వసించాలని ప్రజలను కోరారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరగిన విషయాన్ని దాచిపెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి పోలీసులు తెలియజేశారన్న వార్త కూడా అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం లభించిందన్నది కూడా తప్పుడు కథనం అన్నారు. ఈ కేసుపై సామాజిక మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version