సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్
2018లో 167 పోస్టుల భర్తీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ పత్రాలు డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము నిబంధనల మేరకే మూల్యాంకనం చేశామని ఏపీపీఎస్సీ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసి, మరో 6 నెలల్లో మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్కు వెళ్తామని తెలిపింది.