30 వేల స్కూటర్; 3 లక్షల జరిమానా
ఇటీవల బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని సుధానగర్ కు చెందిన ఓ ద్విచక్రవాహనానికి రూ.3.2 లక్షల జరిమానా ఉన్నట్లు గుర్తించారు. వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న జరిమానాలు చెల్లించకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు యజమానిని హెచ్చరించారు. తన స్కూటర్ విలువ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రూ.30 వేల కన్నా ఎక్కువ ఉండదని, ఆ స్కూటర్ పై రూ.3.2 లక్షల జరిమానా చెల్లించలేనని ఆ వాహన యజమాని అశక్తత వ్యక్తం చేశారు. అయినా, జరిమానాలు చెల్లించాల్సిందేనని, అవసరమైతే, వాయిదా పద్ధతిలో బకాయిలు చెల్లించే అవకాశం కల్పిస్తామని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.