తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. రౌడీలా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తించవద్దని కౌశిక్ రెడ్డి అన్నారు. శాసనసభ మీడియా పాయింట్ లో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. కేసీఆర్ ను ఎందుకు చంపాలని ప్రశ్నించారు. రైతుబంధు, కాళేశ్వరం సహా ఎన్నో అభివృద్ధి పనులు చేసినందుకు కేసీఆర్ ను చంపాలా అని అడిగారు.