Home Entertainment ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో సీనియర్ యాక్టర్!

ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో సీనియర్ యాక్టర్!

2
0


ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో సీనియర్ యాక్టర్!

Google search engine

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సెట్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు రాజేష్ శర్మ ప్రమాదానికి గురయ్యారు. ఒక విషపురుగు కుట్టడం, దానిని ప్రాథమికంగా నిర్లక్ష్యం చేయడంతో ఆయన పరిస్థితి విషమించి ప్రస్తుతం ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజేష్ శర్మ తనకు సంబంధించిన షూటింగ్ ముగించుకుని, సెట్స్‌లోనే తోటి టెక్నీషియన్లతో సరదాగా మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా ఒక పురుగు ఆయన కుడికాలి పాదంపై కుట్టింది. తొలుత అది సాధారణ కీటకమేనని భావించిన ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే, సుమారు ఆరు గంటల తర్వాత అసలు కథ మొదలైంది. ఆయనకు కుడికాలితో పాటు ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు ప్రారంభమవ్వడమే కాకుండా ఒక్కసారిగా తీవ్రమైన జ్వరంతో ఆయన విలవిలలాడిపోయారు.

Tragedy On Prabhas Fauji Set Actor Rajesh Sharma In ICU After Being Bitten By Poisonous Insect In RFC

'ఫౌజీ' రిలీజ్‌ డేట్ ఇదే..? ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..!
‘ఫౌజీ’ రిలీజ్‌ డేట్ ఇదే..? ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..!

ఫ్లైట్‌లోనే పెరిగిన షుగర్ లెవెల్స్.. ఊపిరాడక అల్లాటల్లాడుతూ!

పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాజేష్ శర్మ హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కలకత్తాకు విమానంలో పయనమయ్యారు. అయితే, దురదృష్టవశాత్తూ ఫ్లైట్ ప్రయాణంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. శరీరంలోకి చేరిన విష ప్రభావం వల్ల ఫ్లైట్‌లోనే అమాంతం షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. దీనికి తోడు శ్వాస తీసుకోవడం కూడా విపరీతంగా కష్టమవడంతో కలకత్తాలో విమానం ల్యాండ్ అవ్వగానే ఆయన్ను అత్యవసరంగా అక్కడి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్‌డ్రాప్‌లో విధ్వంసం
ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్‌డ్రాప్‌లో విధ్వంసం

వైద్యుల అత్యవసర చికిత్స.. మోకాలి వరకు ఇన్‌ఫెక్షన్

రాజేష్ శర్మను పరీక్షించిన కలకత్తా వైద్య బృందం షాకింగ్ విషయాలు వెల్లడించింది. విషపురుగు కుట్టిన కారణంగా ఆయన పాదం నుంచి మోకాలి వరకు అత్యంత వేగంగా ఇన్‌ఫెక్షన్ పాకిపోయినట్లు వైద్యులు గుర్తించారు. జ్వరం కూడా అస్సలు తగ్గకపోవడం, అంతర్గత అవయవాలపై ఒత్తిడి పడటంతో ఆయన్ను వెంటనే ఐసీయూ (ICU) విభాగానికి మార్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ శర్మ పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here