2000 కోట్ల ఆస్తులు సంపాదించిన తెలుగు నటి.. ఏంటా స్టోరీ ??
నటి రంభ.. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. తన అందం, అభినయం, డ్యాన్స్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. 1990ల చివరి దశ నుంచి 2000ల ప్రారంభం వరకు దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించిన ఆమె.. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వరుస విజయాలతో దాదాపు 15 సంవత్సరాలకు పైగా స్టార్ హీరోయిన్గా కొనసాగింది. గ్లామర్ పాత్రలతో పాటు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన రంభ, ఒక దశలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.
స్టార్ హీరోలతో వరుస విజయాలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో రంభ దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, సుమన్ వంటి హీరోల సరసన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కనిపించింది. అదే సమయంలో తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో విష్ణువర్ధన్, రవిచంద్రన్ వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ నుంచి బిజినెస్ ఉమెన్గా..
కాగా సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత చాలా మంది హీరోయిన్లు కుటుంబ జీవితానికే పరిమితమవుతుంటారు. కానీ రంభ మాత్రం తన జీవితాన్ని మరో దిశగా మలిచింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ను వివాహం చేసుకున్న ఆమె, పెళ్లి తర్వాత కెనడాలో స్థిరపడింది. అక్కడ కుటుంబ బాధ్యతలతో పాటు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. భర్త నిర్వహిస్తున్న పలు వ్యాపారాల్లో భాగస్వామిగా మారడమే కాకుండా, కొన్ని వ్యాపారాల నిర్వహణలో కూడా కీలక బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం.
వేల కోట్ల ఆస్తుల వెనుక కారణం ఇదేనా?
సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలో రంభ మంచి పారితోషికం అందుకుంది. ఆ ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ప్రచారం ఉంది. మరోవైపు ఆమె భర్త నిర్వహిస్తున్న వ్యాపారాల విలువ కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. వివిధ మీడియా కథనాల ప్రకారం రంభ కుటుంబ ఆస్తుల విలువ సుమారు రూ.2,000 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఖ్యపై రంభ లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమెకు చెన్నై, హైదరాబాద్తో పాటు కెనడాలో కూడా విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు, పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రంభ తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో పాటు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ.. వ్యాపారాలను కూడా చూసుకుంటోంది. ఇటీవల పలు టెలివిజన్ రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తూ తన రీ-ఎంట్రీకి సంకేతాలు ఇచ్చింది. మంచి కథ, తనకు నచ్చిన బలమైన పాత్ర దొరికితే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది.






