15.4 C
New York
Sunday, May 19, 2024

Buy now

షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంలేదు, కాంగ్రెస్ తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం- సజ్జల-amaravati news in telugu sajjala says ys sharmila joins congress no effect on ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

టీడీపీ, కాంగ్రెస్ కలిసే జగన్ పై తప్పుడు కేసులు

వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచైనా ప్రాతనిధ్యం వహించవచ్చని సజ్జల అన్నారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంలేదన్నారు. సీఎం రమేష్‌కు చెందిన విమానంలో షర్మిల, బ్రదర్‌ అనిల్‌ దిల్లీ వెళ్లారన్నారు. ఎయిర్ పోర్టులో టీడీపీ నేత బీటెక్ రవిని, బ్రదర్ అనిల్‌ కలవడం… బెంగళూరులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌తో చంద్రబాబు కలవడం అంత తెరవెనుక రాజకీయాలు అన్నారు. వైఎస్ఆర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్‌పై అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసే గతంలో జగన్ పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక, పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆమెకు పోటీగా పులివెందుల నుంచి వివేకానందరెడ్డిని కాంగ్రెస్‌ బరిలో దించిందని విమర్శఇంచారు. కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఎప్పటి నుంచో కాంటాక్ట్ ఉందన్నారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles