posted on Aug 21, 2024 2:12PM
బంగాళాఖాతంలో అల్ప పీడనాల ప్రభావాలు అంతగా లేవు. నైరుతీ రుతుపవనాలు గతి తప్పడంతో కూడా వర్షాభావం ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 మండ లాలకు పైగా వర్షాభావ పరిస్థితి కనిపిస్తున్నది.ముఖ్యంగా కాలువలు పై నిఘా పెట్టి కాలువ చివరి భూములకునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు ఉమ్మడి కృష్ణా జిల్లా భూములకు అందేలా కూడా చర్యలు తీసుకోవాలి.భూమి,సముద్రం,వాతావరణం మూడు వేడెక్కిపోవడమే ఈ వింత పరిస్థితికి కారణమని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.మామూలు పరిస్థితుల్లో భూమి వేడేక్కినప్పుడు సముద్రం చల్లగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి.గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో రుతుపవనాలు కాలంలోనూ కొన్నిచోట్ల అతివృష్టి,మరోచోట అనావృష్టి ఏర్పడుతున్నది.
భవిష్యత్తు లో ఇలాంటి వాతావరణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.మళ్లీ మనం పాత రోజులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.చెరువులను,కుంటలను వర్షాలు పడినప్పుడు నింపుకుని అవసరాన్ని బట్టి వాడుకోవాలి.అందుకు మనకు ఉన్న భూమిలో కుంటలు తవ్వి వర్షపు నీరునిలువచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.లేదా గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని చెరువులు,కుంటలు నింపాలి.నీటి ప్రాజెక్టు లు,కాలువలద్వారా నీరు వర్షాలు పడితేనే క్రిందకు వస్తాయి. లేకపోతే ప్రాజెక్టుల్లోఎంత జలకళ ఉన్నా రైతుల పొలాల్లో మాత్రం పారే అవకాశం కష్టమే మరి.