IMD warning: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.