వేదికపై కుర్చీలను మార్చిన తర్వాత ఎన్డీఏ పక్ష నాయకుడిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బలపరిచారు. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం అచ్చన్నాయుడు, నాదెండ్ల మనోహర్ గవర్నర్కు లేఖను అందచేశారు.