posted on Jun 11, 2024 10:02AM
ఆయన తన ముఖ్య అనుచరులు సన్నిహితులతో గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భేటీలలో ఆయన తెరాసను వీడి తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
2014 వరకు మల్లారెడ్డి తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్లో చేరి మంత్రిగా పనిచేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో క్రియాశీలంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి రావడంతో మల్లారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.