posted on Mar 22, 2024 3:42PM
తద్వారా చంద్రబాబు తన ఉద్దేశమేమిటన్నది స్పష్టంగా చాటారు. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్, కీలక నేత బొత్స సత్యాన్నారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన నియోజకవర్గ ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననీ, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదనీ అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమీ తేల్చుకోకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేశారు.
ఒక వేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. భీమిలీ, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు మూడో జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళావెంకటరావు, పరిటాల శ్రీరామ్ లు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలూ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.