పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం రెండూ తెలుగు రాష్ట్రాలలో ఈయన హాట్ టాపిక్ గా మారారు.ఈయన హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని(Janasena Party) స్థాపించి ఏపీలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలపైనే పూర్తి ఫోకస్ పెట్టడంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చేశారు.
వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా రాజకీయాలపై ఎంతో ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల తను చివరిగా నటించిన బ్రో సినిమా( Bro Movie ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా సమయంలో చాలామంది నన్ను భారీగా తిట్టారని ఈయన తెలిపారు.
సాధారణంగా నేను గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించను ఒకవేళ గ్రాఫిక్స్ సరిగా రాకపోతే ఎక్కడ దొరికిపోతామో అన్న భయం నాకు ఉంటుంది అందుకే సినిమాలలో గ్రాఫిక్స్ వాడమని తెలిపారు.
ఇకపోతే బ్రో సినిమాలో మేము గ్రాఫిక్స్ వాడాము అంటూ చాలామంది నన్ను తిట్టారని ఆ తిట్లను కూడా నేను పడ్డాను అని పవన్ కళ్యాణ్ కి వెల్లడించారు.అయితే ఇటీవల పార్టీ సభకు గ్రాఫిక్స్ తో జనాలను క్రియేట్ చేశారు అంటూ ఇరువురి పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ నాకు సినిమాల్లోని గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదు అంటూ చెప్పటం ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం పవన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.