కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నానాటికి పెరిగిపోతున్న ఇంధన ధరల నుంచి ప్రజలకు కాస్తంత ఉపశమనం కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై రూ.2 చొప్పున తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి తగ్గిన ధర ప్రజలకు అందుబాటులోకి వస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. అయితే ఎన్నికలప్పుడే ప్రధాని మోదీ సర్కారుకి ధరల తగ్గింపు గుర్తుకు వస్తోందని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ జిమ్మిక్కులు ప్రజలు నమ్మరని అంటున్నారు