Home తెలంగాణ సీసీఎస్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు, బ్యాంకులకు రూ.200 కోట్ల రుణాలు ఎగవేత!-hyderabad...

సీసీఎస్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు, బ్యాంకులకు రూ.200 కోట్ల రుణాలు ఎగవేత!-hyderabad crime news in telugu ccs police arrested economic fraud cheated 200 crores to banks ,తెలంగాణ న్యూస్

0

దేశ వ్యాప్తంగా రూ.200 కోట్ల రుణాలు

రూ. 40 కోట్ల మోసంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లలో రవీంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. అతడిపై నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ కావడంతో సీసీఎస్ ఏసీపీ అశోక్ కుమార్ రంగాల్లోకి దిగారు. రవీంద్ర బాబు ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా… ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాదాపు నెల రోజుల నుంచి అతని కదలికలను గమనిస్తూ వచ్చారు. బెంగళూరు, దిల్లీ, ముంబయిలో సంచరించిన నిందితుడు రవీంద్రబాబును సోమవారం ఈడీ కేసు నిమిత్తం ఆ కార్యాలయంలో హాజరు కావడానికి వచ్చారు. ఆ సమాచారాన్ని తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. రవీంద్రబాబుపై ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక ,రాజస్థాన్ ,మహారాష్ట్ర, సీబీఐ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు రూ.200 కోట్ల రుణాలు తీసుకున్నట్లు నిందితుడు రవీంద్రబాబు అంగీకరించాడు.

Exit mobile version