బస్సు బోల్తా- మహిళ సజీవ దహనం
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో పది మంది గాయపడ్డారు. బస్సు బోల్తా పడటానికి గల కారణం అతి వేగమే అని తెలుస్తోంది. బోల్తా పడిన తరువాత నిమిషాల వ్యవధిలోనే బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే ఈ సమయంలోనే… అద్దాలు పగలకొట్టుకొని చాలా మంది ప్రయాణికులు బయపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో ఇరుక్కుపోవటంతో బయటికి రాలేకపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ లోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళ సజీవ దహనమైంది.