- ప్రభాకర్ గుప్తా మృతికి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సంతాపం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమళ్ మామ ప్రముఖ వ్యాపారవేత్త తాటికొండ ప్రభాకర్ గుప్తా అకాల మరణం పట్ల ఆర్ బి ఓ ఎల్ సంస్థ అధినేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం ప్రభాకర్ గుప్తా స్వగృహానికి చేరుకున్న శ్రీనివాస్ రెడ్డి వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభాకర్ గుప్తా మరణం తాండూరు వ్యాపార రంగానికి మరియు వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.అనంతరం ప్రభాకర్ గుప్తా కుమారుడు పరిమళ్ గుప్తను, కోడలు స్వప్నను మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.



