న్యూయార్క్ నుంచి వస్తుండగా..
ఆ ప్రయాణికుడు న్యూయార్క్ నుంచి ముంబైకి ఏఐ-116 విమానంలో తన భార్యతో కలిసి వచ్చాడు. ముంబై ఏర్ పోర్ట్ లో దిగగానే తమకు వీల్ చైర్ కావాలని వారు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, వీల్ చైర్ల కొరత కారణంగా, ఆ దంపతుల్లో ఒకరికి మాత్రమే వీల్ చైర్ లభించింది. దాంతో, తన భార్య వీల్ చైర్ లో వెళ్తుండగా, తోడుగా ఆ వృద్ధుడు విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు, దాదాపు 1.5 కిమీల దూరం, నడిచి వెళ్లాడు. దాంతో, ఒక్కసారిగా అలసిపోయి, గుండె పోటుకు గురయ్యాడు. అక్కడే కుప్పకూలి చనిపోయాడు.