పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనండి..
భూములు కొంటున్నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని.. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. అన్ని డాక్యూమెంట్స్, హద్దులు చెక్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం భూమిలో ఎవరు కబ్జాలో ఉన్నారనేది చుట్టూ పక్కలా వారిని అడిగి తెలుసుకోవాలని వివరించారు. తొందరపడి భూములను కొనుగోలు చేస్తే.. పోయిన డబ్బును తిరిగి పొందడం కష్టమని స్పష్టం చేశారు. భూములను అమ్మించే రియల్టర్స్ ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.