హార్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ జుయు లియు ఒక మీడియా ప్రకటనలో, సాధారణంగా ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్న రోగికి కణజాల ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఇది 20 శాతం కేసులలో మాత్రమే విజయవంతమవుతుంది. కానీ రోగికి మందులతో పాటు బ్రోకలీలో ఉన్న సమ్మేళనంతో చికిత్స చేసినప్పుడు, ఇది 60 శాతం విజయవంతమయ్యే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టకుండా అడ్డుకోవడానికి, స్ట్రోక్ ను నివారించడానికి బ్రోకలీలో ఉన్న సమ్మేళనం కూడా ఉపయోగించాలని అధ్యయనం తేల్చింది.