Home తెలంగాణ బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు-siddipet online trading fraud...

బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు-siddipet online trading fraud man cheated bank manager with 80 lakh rupees arrested ,తెలంగాణ న్యూస్

0

Online Trading Fraud : ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా ఓ బ్యాంకు మేనేజర్ నే రూ. 80 లక్షలు మోసం చేసిన ఒక సైబర్ నేరస్తుడ్ని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సిద్దిపేట సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాకు చెందిన బీమిశెట్టి వెంకటరామ్ నాయుడు (45) హైటెక్ సిటీ మాదాపూర్ లో నివాసం ఉంటున్నాడు. సిద్దిపేట పట్టణంలో పనిచేసే ఒక బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్, మెయిల్ ద్వారా వెంకటరామ్ ఒక లింక్ పంపించాడు. ఇందులో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని బ్యాంకు మేనేజర్ ను నేరస్తుడు నమ్మించాడు. అది నమ్మిన బ్యాంకు మేనేజర్ గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా 25 రోజులలో పలు విడతలుగా రూ.80 లక్షలు పంపించాడు. అనంతరం నేరస్థులకు ఫోన్ చేయగా, అతడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు.

Exit mobile version