24 చెరువుల్లో నిమజ్జనం
వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన 4,600 విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిమజ్జనం ప్రక్రియ కొనసాగనుండగా.. ట్రై సిటీ వ్యాప్తంగా 24 చెరువులను పరిశీలించారు. అందులో ప్రధానంగా కట్ట మల్లన్న చెరువు, చిన్న వడ్డెపల్లి చెరువు, కోట చెరువు, ఉర్సు గుట్ట చెరువు(రంగ సముద్రం), బెస్తం చెరువు, పెద్ద చెరువు, అగర్తలా చెరువు, బంధం చెరువు, సిద్దేశ్వర గుండం, చల్లా చెరువు, గోపాల్ పూర్ చెరువు, భీమారం శ్యామల చెరువు, హసన్ పర్తి పెద్ద చెరువులు ప్రధానమైనవి.