Home అంతర్జాతీయం CJI Chandrachud: ‘గణపతి పూజ’ వివాదంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

CJI Chandrachud: ‘గణపతి పూజ’ వివాదంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

0

మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు

‘‘ప్రధాన న్యాయమూర్తి నివాసానికి ప్రధాని వెళ్లారు. అక్కడ సీజేఐ, ఆయన భార్యతో కలిసి గణేశుడికి హారతి ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు ఈ విధంగా రాజకీయ నాయకులను కలవడం అనుమానాలకు తావిస్తోందనేది మా ఆందోళన. ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధం ఉన్న మహారాష్ట్రలో మా కేసు ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణ జరుగుతోంది. ప్రధానమంత్రి ఇందులో భాగం. మాకు న్యాయం జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నాం. చీఫ్ జస్టిస్ ఈ కేసు నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలించాలి’’ అని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. గణపతి ఉత్సవ్ సందర్భంగా ప్రజలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ప్రధాని ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు వెళ్లారో తనకు సమాచారం లేదని ఆయన అన్నారు. తమ మహారాష్ట్ర సదన్ తో సహా ఢిల్లీలో అనేక వేడుకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విచారణను ముగించడంపై చీఫ్ జస్టిస్ దృష్టి పెడతారని ఆశిస్తున్నానని రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.

Exit mobile version