posted on Sep 10, 2024 3:59PM
బీరువాలో దాచుకున్న బంగారం రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగారం విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ తరుణ్ హైకోర్టును కోరారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది.ఈ కేసు కొనసాగుతుండగానే రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.