ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. కవిత తరపు సీనియర్ న్యాయవాది రోహత్గీ మాట్లాడుతూ, ఆమె ఒక మహిళ, సిట్టింగ్ ఎమ్మెల్సీ అని, అందువల్ల ఆమె న్యాయం నుండి పారిపోయే అవకాశం లేదని, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఒకరికి ఏది సరైనదో, ఏది తప్పో తెలుసునని, బలహీనులు కాదని వ్యాఖ్యానించారు.