పొలిటికల్ టర్న్..
వాణీ, మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వీరి వ్యవహారంలో గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై వైసీపీ సీరియస్ అయ్యింది. భార్యాభర్తల గొడవను రాజకీయం చేస్తున్నారని టీడీపీపై ఆరోపణలు చేసింది. మరోవైపు వీరి సమస్యను పరిష్కరించేందుకు లాయర్లు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అటు కుటుంబ సభ్యులు కూడా వివాదం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది.