ఉద్యోగుల్లో దాదాపు 1500మందికి పైగా బదిలీ నుంచి మినహాయింపు కోరనుండటం, ఏళ్ల తరబడి అయా శాఖల్లో పాతుకుపోయి వాటిని శాసించడంపై ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఇక కొన్ని సంఘాల నాయకులు అసలు పనిచేయకుండా ఎప్పుడూ జిల్లా పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, సచివాలయాల్లో చక్కర్లు కొడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న వారికి విధుల నుంచి మినహాయింపును అడ్డం పెట్టుకుని జల్సా చేస్తుంటారు. ప్రభుత్వం కూడా వీరిని కట్టడి చేయలేకపోతుందనే విమర్శలున్నాయి.