posted on Apr 14, 2024 11:04AM
ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వరద కూడా అలాంటి చెత్తా చెదారాన్ని పుష్కలంగా కలిగి వుంది. మొన్నటి వరకూ వైసీపీలో వుండి సదరు పార్టీ అరాచకాల్లో భాగం పంచుకుని, ఇప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని తెలియగానే చడీ చప్పుడు కాకుండా, అమాయకపు చక్రవర్తుల్లా ముఖాలు పెట్టుకుని టీడీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి వస్తున్నారు కదా అని ముందూ వెనుకా ఆలోచించకుండా పార్టీలోకి చేర్చుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం కంటే నష్టం జరిగే అవకాశం వుంటుంది.
పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరగడానికి ఈ వైసీపీ చెత్త కూడా ఒక కారణం అయ్యే అవకాశం వుంది. అందువల్ల తెలుగుదేశం నాయకులు వైసీపీ నుంచి వచ్చే చేరికల వరదకు గేట్లు తీసే ముందు చెత్తను ఫిల్టర్ చేసే జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది.