Home తెలంగాణ రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష-karimnagar bjp mp...

రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష-karimnagar bjp mp bandi sanjay announced rythu deeksha support farmers issues ,తెలంగాణ న్యూస్

0

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బండి బస

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమలుతో పాటు యుద్ద ప్రాతిపదికన పరిహారం అందజేయాలని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బండి సంజయ్ ఉద్యమ సైరన్(Bandi Sanjay Jung Siren) ను మోగించారు. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తప్ప, తేమ పేరుతో తరుగు లేకుండా ధాన్యం(paddy procurement) పూర్తిస్థాయిలో కొనుగోలు చేయించడమే లక్ష్యంగా బండి సంజయ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తప్ప, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నారు. దీంతోపాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.

Exit mobile version