దానాలు ప్రధానం
మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు దక్కుతుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి బ్రహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్ర, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు దానధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేయాలి. చంద్ర గ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్ర దానం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. కుజ దోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహు, కేతు దోషాలు ఉన్న వాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరిసంపదలు దక్కుతాయి.