ఈరోజు కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి భీష్ముడికి పూజ చేస్తారు. ఈరోజు తర్పణం సమర్పించడం ఆచారం. ననువ్వులు, నీళ్ళు, పూలతో తర్పణం వదులుతారు. భీష్మాష్టమి రోజు చేసే దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పితృదేవతలని తలుచుకుని బియ్యం, పప్పు, వస్త్రాలు, డబ్బు వంటివి వాటిని అవసరంలో ఉన్న వారికి దానం చేస్తారు. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్మ పితామహుడు, పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుందని అంటారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత తర్పణాలు వదలాలి.