MP Balashowry : ఏపీలో వైసీపీకి మరో భారీ షాక్ తగలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. బాలశౌరి త్వరలో జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. స్థానిక నేతల తీరుతో మనస్తాపానికి గురైన బాలశౌరి, గత కొన్ని రోజులుగా మచిలీపట్నానికి దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు. ఇటీవలె కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా బాలశౌరి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగుతోంది.