ఒకే ఏరియా వారు..
బుధవారం సాయంత్రం తూర్పు ఢిల్లీలోని భికం సింగ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, ఒక పోలీసు బృందం క్రైమ్ స్పాట్కు చేరుకుందని, బాధితుడు సందీప్ కుమార్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ బుధవారం స్థానికంగా ఉండే వికాస్ కు చెందిన మోమోస్ బండి నుంచి మోమోస్ కొనడానికి వెళ్లాడు. వికాస్ రెడ్ సాస్ తో పాటు మోమోస్ ని సందీప్ కి అందించాడు. సందీప్ వికాస్ నుండి మరింత సాస్ డిమాండ్ చేసాడు. సాస్ కొద్దిగానే ఉందని, వేరే కస్టమర్లకు అది అవసరం అని వికాస్, సందీప్ కు ఎక్స్ట్రా సాస్ ఇచ్చేందుకు నిరాకరించాడు. సందీప్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కాస్తా హింసాత్మకంగా మారింది. వికాస్ బండిపై నుంచి కత్తిని తీసుకుని సందీప్ ముఖంపై రెండుసార్లు పొడిచాడు.