చంపలేదనే వాదన..
గోవాలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఒక సూట్ కేసులో కుక్కి, టాక్సీలో బెంగళూరుకు బయల్దేరిన బెంగళూరు స్టార్టప్ సీఈఓ (Bengaluru CEO Suchana Seth) సుచనా సేథ్ ను సోమవారం రాత్రి, నాటకీయంగా చిత్రదుర్గలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత, మరుసటి రోజు ఆమెను మళ్లీ గోవాకు తీసుకువచ్చారు. కోర్టు ఆమెకు ఆరు రోజుల పోలీసు కస్టడీని ఆదేశించింది. అయితే, పోలీసుల విచారణలో ఆమె తన తప్పును ఒప్పుకోవడం లేదు. తాను నిద్ర లేచే సమయానికే తన కుమారుడు చనిపోయి ఉన్నాడని వాదిస్తోంది. దాంతో, హత్య వెనుక ఉద్దేశ్యంపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సుచనా సేథ్ AI ఎథిక్స్ నిపుణురాలు, డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ టీమ్లను మెంటారింగ్ చేయడంలో, స్కేలింగ్ మెషిన్ లెర్నింగ్ సొల్యూషన్స్లో 12 సంవత్సరాల అనుభవం ఉంది.