Home తెలంగాణ ఆ నేతకే మళ్లీ ఎంపీ టికెట్…! లోక్ సభ ఎన్నికల బీఆర్ఎస్ ఫోకస్-brs is shifting...

ఆ నేతకే మళ్లీ ఎంపీ టికెట్…! లోక్ సభ ఎన్నికల బీఆర్ఎస్ ఫోకస్-brs is shifting its gears and focusing its arsenal for the upcoming lok sabha elections 2024 ,తెలంగాణ న్యూస్

0

గతంలో మాదిరిగానే చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలన్నారు కేటీఆర్. అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదేస్థాయిలో… అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కోరారు. ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version