Friday, April 3, 2026

దూకుడు పెంచిన బీఎస్ఆర్…!

-

  • తాండూర్ వార్డుల్లో దూసుకుపోతున్న ‘బీఎస్ఆర్’
  •  కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  •  13, 21, 22 వార్డుల్లో జననీరాజనం

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 13, 21, మరియు 22వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలనలో తాండూర్ మున్సిపాలిటీ ఎదుర్కొన్న సమస్యలను ఎండగట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే వార్డుల్లో డ్రైనేజీ, తాగునీరు మరియు రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగుపడతాయని ఆయన ప్రజలకు వివరించారు.ప్రచారంలో భాగంగా శ్రీనివాస్ రెడ్డికి వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘బీఎస్ఆర్’ వెంటే తామంతా ఉంటామని నినదించారు. అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు అభ్యర్థులతో పాటు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img
  • తాండూర్ వార్డుల్లో దూసుకుపోతున్న ‘బీఎస్ఆర్’
  •  కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  •  13, 21, 22 వార్డుల్లో జననీరాజనం

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 13, 21, మరియు 22వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలనలో తాండూర్ మున్సిపాలిటీ ఎదుర్కొన్న సమస్యలను ఎండగట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే వార్డుల్లో డ్రైనేజీ, తాగునీరు మరియు రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగుపడతాయని ఆయన ప్రజలకు వివరించారు.ప్రచారంలో భాగంగా శ్రీనివాస్ రెడ్డికి వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘బీఎస్ఆర్’ వెంటే తామంతా ఉంటామని నినదించారు. అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు అభ్యర్థులతో పాటు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories