- తాండూరులో ‘గులాబీ’ గర్జన..!
- నేడు కేటీఆర్ భారీ రోడ్ షో
- మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి.. ఇందిరా చౌక్ వద్ద ప్రచార భేరి
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తాండూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నేడు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10:00 గంటలకు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఇందిరా చౌక్ వద్ద నిర్వహించే భారీ రోడ్ షోలో ఆయన పాల్గొంటారు.మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యేలు మరియు స్థానిక నేతలు ఈ రోడ్ షోను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.కేటీఆర్ రాకను పురస్కరించుకుని తాండూరు పోలీసులు పట్టణంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందిరా చౌక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.






