Tuesday, October 22, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi

posted on Sep 16, 2024 9:53AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వరుస సెలవులు రావడంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

క్యూలైన్ క్యూ కాంప్లెక్స్ దాటి టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 85వేల 626 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 138 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 13 లక్షల రూపాయలు వచ్చింది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana