కన్నడలో రొమాంటిక్ డ్రామా గిల్లి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రకుల్. ఆమె నటించిన తొలి టాలీవుడ్ చిత్రం కెరటం. దక్షిణాది సినిమాల్లో బిజీగా ఉన్న టైమ్లోనే బాలీవుడ్ వైపు రకుల్ వెళ్లింది. హిమాన్ష్ కోహ్లీ సరసన దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించిన యారియన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఈ భామ అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో అయ్యారీ, దే దే ప్యార్ దే, సిమ్లా మిర్చి, అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్, ఛత్రివాలీ, ఐ లవ్ యూ వంటి చిత్రాల్లో నటించింది.