ఇలా మహాలయ పక్షాలలో తిథి ప్రకారం గతించిన పితృ దేవతలకు ఈ పదిహేను తిథులలో వారు గతించిన తిథి ప్రకారం ఆరోజు వారికి పితృ కర్మలు ఆచరించడం వల్ల దోష నివృత్తి జరిగి పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని శుభ ఫలితాలు పొందుతారని చిలకమర్తి తెలిపారు. మహాలయ పక్షాలలో శ్రద్ధ కర్మలు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, అన్నదానం, వస్త్ర దానం వంటి దానాలు ఆచరించడం, పితృ దేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిదని చిలకమర్తి తెలిపారు.