50 వేల కోసం
నిఖిల్, యశ్మీ వాదించుకున్నట్లు చూపించారు. తర్వాత “రెండో అవకాశం విలువ రూ. 50 వేలు. ప్లాస్మాలో చూపించిన సభ్యులు కలర్ బాల్స్ టాస్క్ ఆడాలి” అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. స్క్రీన్లో పృథ్వీ, నబీల్, నిఖిల్ పేర్లు ఉన్నాయి. వీళ్లు ఓ తాడును పట్టుకుని లాక్కెళ్తూ తమకు చెందిన కలర్ బాల్స్ను తమ బాస్కెట్లో వేయాలి. 50 వేలకోసం జరిగే ఈ పోటీలో తాడును నబీల్ పట్టుకోలేకపోయాడు.