Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSజ్యోతిర్లింగ దర్శనంలో శ్రీనివాస్ రెడ్డి దంపతులు

జ్యోతిర్లింగ దర్శనంలో శ్రీనివాస్ రెడ్డి దంపతులు

spot_img
  • వినాయక కన్వెన్షన్‌లో ఆధ్యాత్మిక సందడి.. 
  • సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ వినాయక కన్వెన్షన్‌లో మంగళవారం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ తాండూరు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి ఏళ్ల నాటి పురాతన సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, పూజ మరియు సత్సంగం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా నిర్వహించబడింది.ఈ విశేష కార్యక్రమానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బిఓఎల్ అధినేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యి ఏళ్ల నాటి అరుదైన సోమనాథ జ్యోతిర్లింగ అవశేషాలను దర్శించుకోవడం అదృష్టమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకి ప్రశాంతతను ఇస్తాయని వారు పేర్కొన్నారు.అనంతరం నిర్వహించిన సత్సంగంలో భక్తులతో కలిసి పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.