AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డీఎస్సీ గురించి ఇప్పుటికే సీఎం జగన్ తో చర్చించామన్నారు. త్వరలో వివరాలను తెలియజేస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే సీఎం డీఎస్సీపై చర్చించామని, సంక్రాంతి కానుకగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తామన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.