జవాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ…
గత ఏడాది షారుఖాన్ జవాన్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ హిట్తో బాలీవుడ్లో నయనతారకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తెలుగు సినిమాలకు మాత్రం నయనతార దూరంగా ఉంటోంది. తెలుగులో చివరగా చిరంజీవి గాడ్ఫాదర్ మూవీలో నయనతార కనిపించింది. ఈ మలయాళ రీమేక్ మూవీలో హీరోయిన్గా కాకుండా చిరంజీవి సోదరిగా నయనతార నటించడం గమనార్హం.