బదిలీ కోరుకునే ఉద్యోగులు సంబంధిత వెబ్సైట్లో మెరిట్, సీనియారిటీ వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తును ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అపాయింట్మెంట్ అథారిటీ పరిశీలించి, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇవాళ్టి వరకు బదిలీ దరఖాస్తులు స్వీకరిస్తారు. నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే క్రమశిక్షణా చర్యలకు గురైనా ఉద్యోగులు, ఏసీబీ, విజిలెన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బదిలీలకు అనర్హలు.