సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మైసూరావారిపల్లి గ్రామసభలో మాట్లాడిన ఆయన.. సినిమాలకంటే సమాజమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తనకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.